భారతదేశం, ఫిబ్రవరి 8 -- తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGFDCL) తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ కింద వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో ప్రీమియం ఎకో టూరిజం 'ది బ్రీజ్' ప్యాకేజీని ప్రారంభించినట్లు ప్రకటించింది. డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్ టూరిస్టులకు మంచి అనుభూతి కలిగేలా ప్లాన్ చేస్తోంది. సందర్శకుల అనుభవానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ది బ్రీజ్‌లో భాగంగా క్యూరేటెడ్ బసలు, గైడ్‌ల ఆధ్వర్యంలో అడవిలో తిరగడంలాంటివి ఉంటాయి. ప్రకృతిని ఆస్వాదించే కార్యకలాపాలను అందిస్తుంది.

ది బ్రీజ్ అనే పేరుతో పర్యావరణ అవగాహన, బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ పౌరులకు సురక్షితమైన, నిర్మాణాత్మకమైన, పూర్తిగా మార్గదర్శక అటవీ అనుభవాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్టుగా TGFDCL ఒక ప్రకటనలో తెలిపింది.

ఆధ...