భారతదేశం, మే 25 -- థియేటర్ల బంద్ విషయం టాలీవుడ్‍లో పెద్ద రచ్చగా మారింది. థియేటర్ల మూసివేత ఉండదని ఖరారైనా.. అసలు ముందుగా ఆ నిర్ణయం ఎలా తీసుకున్నారనేది వివాదమైంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12న విడుదల కానుండగా.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని కొందరు ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రకటించారు. అయితే, బంద్ ఉండదని తాజాగా మరో సమావేశం తర్వాత ప్రకటన వచ్చింది. అయితే, ముందుగా వెలువడిన బంద్ నిర్ణయం వెనుక కొందరి కుట్ర ఉందంటూ ఆరోపణలు వచ్చాయి. పవన్ కల్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ వివాదంపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేడు (మే 25) స్పందించారు.

థియేటర్లు మూసివేయాలని కొందరు తీసుకున్న నిర్ణయానికి తనకు సంబంధం లేదని అల్లు అరవింద్ నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు. అది కొందరు తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని, అందుకే...