Hyderabad, జూన్ 1 -- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ బీభత్సం 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధా మోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై హీరోయిన్స్‌గా చేశారు. మే 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన భైరవం చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.

ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ బీభత్సం 'భైరవం' క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్‌లో మంచు మనోజ్‌తోపాటు ఇతర హీరోలు, డైరెక్టర్ విజయ్ కనకమేడలను అడిగిన ప్రశ్నలు ఆసక్తికర సమాధానాలు చెప్పారు. అయితే, మంచు ఫ్యామిలీలో గొడవల నేపథ్యంలో మంచు మనోజ్ ఇచ్చిన ఓ సమాధానం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది.

-అది డీఎన్ఏ. ఆయన (మోహన్ బాబు) దగ్గర నుంచి నాకు వచ్చిన ...