భారతదేశం, మే 22 -- ద్దరు పర్యాటకులు అడవిలో నడుస్తున్నారు. అకస్మాత్తుగా వారి కళ్లకు ఏదో మెరిసినట్టుగా అనిపించింది. తర్వాత దాని దగ్గరకు వెళ్లి చూడగా.. నిధి కనిపించింది. ఇది సినిమాలోని సన్నివేశం కాదు. ఇటీవలే జరిగిన నిజ సంఘటన. చెక్ రిపబ్లిక్‌లో అడవిలో పర్యాటకుల ట్రెక్కింగ్ సందర్భంగా బంగారు నాణేలు దొరికాయి. అడవిలో ప్రశాంతమైన నడకగా ప్రారంభమైన ఈ ప్రయాణం వారి జీవితంలో మరిచిపోలేని ఘటనగా నిలిచింది.

చెక్ రిపబ్లిక్ ఉత్తరాన ఉన్న క్రోనోస్ పర్వతాలలో ఇద్దరు వ్యక్తులు ట్రెక్కింగ్ చేస్తున్నారు. నెమ్మదిగా పర్వతం ఎక్కుతుండగా, వారు ఒక దృశ్యాన్ని చూశారు. గడ్డితో ఒక పచ్చని ప్రాంతం ఉంది. అక్కడే ఒక రాయి కింద ఒక మెరుపు కనిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించినప్పుడు అక్కడ ఓ అల్యూమినియం పెట్టె ఉందని వారికి అర్థమైంది. వాళ్ళు దాన్ని తెరిచినప్పుడు లోపల పెద్ద నిధిని చూస...