భారతదేశం, మే 16 -- బాలికల విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినిలకు ప్రతి సంవత్సరం రూ.30,000 అందించనుంది. ఈ స్కాలర్‌షిప్‌ను అజీమ్ ప్రేమ్‌జీ పేరిట ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణతో సహా 18 రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. 2.5 లక్షల మంది బాలికలకు స్కాలర్‌షిప్‌లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

విద్యార్థులు తమ టెన్త్, ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో, మున్సిపల్ పాఠశాలలతో పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ లేదా ఏదైనా డిప్లొమా కోర్సును అభ్యసించడానికి ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలో చేరి ఉండాలి.

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనురాగ్ బెహర్ మాట్లాడుతూ 'ఒక విద్యార్థి తన డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేసే వ...