భారతదేశం, మే 5 -- ఏపీలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. చేతికందిన పంటను నీటి పాలు చేశాయి. అకాల వర్షాలతో వరి, అరటి, మామిడి, మొన్నజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పిడుగుపాటుకి గురై మరణించిన వారి కుటుంబాలను ఆదుడుకుంటామని హామీ ఇచ్చారు.

ఇటీవల వర్షాలకు ఏపీలో 2224 హెక్టార్లలో వరి, 128 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు సీఎంకు నివేదిక అందించారు.

అకాల వర్షాలు, పంట నష్టంపై సీఎం సమీక్ష నిర్వహించారని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొన్ని చోట్ల ధాన్యం తడిసినట్లు కలెక్టర్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారన్నారు. రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారని ఇచ్చారు.

ఏ రైతూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి పార్థ...