భారతదేశం, జూన్ 25 -- ఆక్సియమ్ 4 మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్తున్న నలుగురు సభ్యుల బృందంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా కూడా ఉన్నారు. ఆక్సియమ్ 4 మిషన్ పైలట్ అయిన శుక్లా అంతరిక్షంలోకి వెళ్లిన రెండో భారతీయ వ్యోమగామి. సాంకేతిక జాప్యం కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ విమానం ఎట్టకేలకు బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.

గత నలభై ఏళ్లలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించిన తొలి భారతీయ వ్యోమగామిగా శుక్లా రికార్డు సృష్టించారు. ఆయనతో పాటు మిషన్ కమాండర్, నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్, మిషన్ నిపుణులు స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నీవ్స్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరి) ఉన్నారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామి గురించి శుక్లా మాట్లాడుతూ.. ఆ రోజుల్లో రాకేశ్ శర్మ మాదిరిగానే యువతకు స్ఫూర్త...