ఆంధ్రప్రదేశ్,అమరావతి, ఫిబ్రవరి 17 -- YSRCP Sixth Incharges List 2024: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ తెగ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇంఛార్జులను మార్చిన ఫ్యాన్ పార్టీ. తాజాగా ఏడో జాబితాను కూడా వెల్లడించింది. ఇందులో కేవలం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జులను ప్రకటించింది. పర్చూరుకు ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్ లను పార్టీ సమన్వయకర్తలుగా నియమించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా మార్పులతో కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ప్లేస్ లో అరవిందా యాదవ్ ను ఇంఛార్జ్‌గా బాధ్యతలు చూడనున్నారు. ఇక కీలకమైన పర్చూరు నుంచి ఆమంచి కృష్ణమోహన్ ఖరారు అవుతుందన్న వార్తలు వినిపించినప్పటికీ.. ఈ ప్లేస్ ను ఎడం బాలాజీకి ఖరారు చేశారు.

ఈసారి భారీ మార్పులతో ఎన్...