భారతదేశం, ఫిబ్రవరి 9 -- మారుతి సుజుకి నుంచి వచ్చిన కారు ఎర్టిగా (Maruti Suzuki Ertiga) భారతదేశంలో అత్యంత వేగంగా 10 లక్షల అమ్మకాలను సాధించిన ఎంపీవీగా ఒక మైలురాయిని సాధించింది. భారతీయ ఆటో మార్కెట్లో రెనాల్ట్ ట్రైబర్, కియా కారెన్స్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీదారుగా ఎర్టిగా ఉంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన మోడల్ అనే బిరుదును ఎర్టిగా సాధించింది. దేశంలో విక్రయించే అన్ని బహుళ ప్రయోజన వాహనాల (multi-purpose vehicles) లో మూడింట ఒక వంతుకు పైగా మార్కెట్ వాటా ఎర్టిగా () కే ఉంది.

2012 లో మూడు వరుసల సీట్లతో, ఎంపీవీ సెగ్మెంట్లో ఎర్టిగా (Maruti Suzuki Ertiga)ను మారుతి సుజుకీ లాంచ్ చేసింది. 2022 లో సరికొత్త ఫేస్ లిఫ్ట్ ఎడిషన్ ను రిలీజ్ చేసింది. మారుతి సుజుకి అమ్మకాలను నడిపించడంలో ఎర్టిగా కీలక పాత్ర పోషించింది. సగటున 10,000 యూనిట్లకు పైగ...